Wednesday, October 21, 2009

Farmers Cry


To see the News Item - Click on the picture to Maximize..



హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: వరుస విపత్తులతో రైతులకు రోదనే మిగిలింది.
కరవు, వరదలకు విపరీతంగా నష్టపోయిన రైతులకిప్పుడు దిక్కుతోచడం లేదు.
అప్పులు తెచ్చిన సొమ్మంతా మట్టిలో కలిస్తే రబీలో మరో పంట వేసేదెలాగో
పాలుపోవడం లేదు. ప్రభుత్వం పంట నష్టం ప్రాథమిక అంచనాలు, ప్రకటనలు తప్ప
రైతు లెవరికీ పరిహారం ఇప్పటికీ అందలేదు. కరవు, వరదల వల్ల 30 లక్షల మంది
రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకదాని వెంట మరొకటిగా వచ్చిన
విపత్తులకు సుమారు 40 లక్షల ఎకరాల్లో పంటలు మట్టిపాలయ్యాయి. వీటిలో
జరిగిన భారీ నష్టానికి రైతులకు రూ. 674 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీ
ఇవ్వాల్సి వస్తుందని ప్రాథమిక అంచనా.

ఇన్‌పుట్‌ సబ్సిడీ మాట అటుంచితే ఠంచనుగా అందాల్సిన పంటలబీమా జాడ లేదు.
రైతులకు బీమా పరిహారం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 800 కోట్లకు
పైగా ఇవ్వాల్సి ఉంది. ఖరీఫ్‌ సీజన్‌ వరకు రూ. 1200 కోట్ల మేర రైతులకు
రుణాలు ఇచ్చినా, కౌలు రైతులకు లక్ష్యాల మేరకు రుణాలు అందిన దాఖలాలు లేవు.
రాష్ట్రంలో ఈ ఏడాది జూన్‌ నుంచి కరవు విలయతాండవం చేస్తున్నా అధికారిక
ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో కేంద్ర సాయం రాలేదు. వెనువెంటనే
వచ్చిన వరద బీభత్సానికి రైతులు తేరుకోలేదు.



కరవుతో 23 లక్షల మంది రైతులకు కన్నీళ్లు

నాలుగు నెలల పాటు రాష్టవ్య్రాప్తంగా కరవు చేసిన విలయ తాండవానికి దాదాపు
23 లక్షల మంది రైతుల పంటలు 13, 55, 854 హెక్టార్లలో పూర్తిగా ఎండి
పోయాయి. కరవు వల్ల నష్టపోయిన రైతులకు రూ. 532 కోట్ల మేర ఇన్‌పుట్‌
సబ్సిడీ ఇంకా అందాల్సి ఉందని వ్యవసాయ శాఖ అంచనాలు చెబుతున్నాయి. అక్టోబరు
రెండవ వారంలోనే పూర్తిస్థాయి నివేదిక విడుదల చేయడంతో ఇంకా ఏ ఒక్క రైతుకు
కరవు వల్ల జరిగిన నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ కానీ పంట బీమా పరిహారం
కానీ అందలేదు.

రైతులకు అందించాల్సిన పరిహారం కోసం విపత్తు సహాయ నిధి (సిఆర్‌ఎఫ్‌) కి
పంట నష్టంనివేదికలు పంపామని, అక్కడి నుంచి నిధులు రాగానే రైతులకు
పెట్టుబడి రాయితీ అందుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కరవు
తరువాత వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన తమకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట బీమా
వీటిలో ఏదీ అందకుండా రబీలో పంటలు ఎలా వేయగలమని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అసలు రాష్ట్రానికి విపత్తు సహాయ నిధి (సిఆర్‌ఎఫ్‌) పరిధిలో ఉన్న మొత్తం
రూ. 420 కోట్లు మాత్రమే. వీటిని కూడా రూ. 210 కోట్ల చొప్పున రెండు
విడతల్లో అత్యవసర సహాయ చర్యల కోసం ఖర్చు చేసేశారు.


పంట బీమాకు కేంద్రం తాత్సారం :

ఇక పంట బీమా పరిహారమైనా సకాలంలో అందుతుందేమోనని 7.5 లక్షల మం ది రైతులు
ఎదురు చూపులు చూస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో
అంతకంతకూ తాత్సా రం చేస్తోంది. కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
రఘువీరా రెడ్డి, సీఎం రోశయ్య చేస్తున్న విజ్ఞప్తులు ఫలితా లనివ్వడం లేదు.


కౌలుకు దుఃఖం :

ఈ సారి వరదలకు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువమంది కౌలు
రైతులకే నష్టం జరిగింది. మూడు జిల్లాల్లో కలిపి దాదాపు 2 లక్షల ఎకరాల్లో
వీరు వేసిన పంటలు పూర్తిగా పోయాయి. దీంతో వీరందరూ అప్పులు తెచ్చిన భూమిలో
పోసి డబ్బులన్నీ వరదలకు కొట్టుకుపో యాయి. ఈ వరుస ప్రతికూల పరిణామాలతో
అక్కడి రైతులు ఒక్కసారిగా బిత్తరపోయారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకు
పోయిన వారు బలవర్మణాలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.


సిద్ధం కాని అంచనాలు :

ఐదు జిల్లాల్లో వరద బీభత్సం వల్ల జరిగిన పంట నష్టం అంచనాలు ఇంకా సిద్ధం
కాలేదు. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించి చేతులు దులుపుకుంది.
రెండు వారాల్లోగా ఈ నివేదికలు అందాల్సి ఉంది. కరవు ప్రకటనకు మూడు నెలల
పాటు జాప్యం జరగడంతో మనకు కేంద్రసాయం రాలేదు. దుర్భిక్షంపై అధికారిక
ప్రకటనలు చేసిన పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాలకు ప్రధాని తక్షణం
స్పందించి ఒక్కొక్కరికీ రూ. 1000 కోట్లు సాయం అందించారు. ఇక కేంద్రం
నుంచి పరిశీలక బృందాలు రావడం ఆలస్యం కావడం వల్ల అనుకున్న ఫలితాలు వచ్చేలా
లేవు. ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకున్నట్లు లేకపోవ డంతో నష్టం తీవ్రత
తక్కువగా కనిపించే అవకాశ ముందని రైతులు సంఘాల నేతలు వ్యాఖ్యలు
చేస్తున్నారు. దీంతో కేంద్ర బృందాల వల్ల పెద్దగా ఒరిగేదేం కనిపించడం
లేదు.

Tuesday, October 20, 2009

What a Faithful GOD..!

When a Vehicle going with more than 120 Km speed on National Highway and suddenly two of its tires burst out… with steel rims, axle only it drags up to 100 Yards, then hits to the road divider!!

What will happen...?!

It’s a severe road accident. The passengers traveling by that vehicle, perhaps some people will die… reminding people may have got serious injuries. .. Horrible Death scene on highway flashes in our minds.

In natural circumstances it’s all true. But When God’s divine intervention is there things comes out differently. This is my experience… our church experience.

***

This is what the exact condition we were facing last Monday (12.10.2009). Our church team went to distribute relief material to the flood victims in Kurnool district. We started early in the morning from Church Office on 12th and reached Jadcharla in Mahaboobnagar district by 8 am. We were traveling in two vehicles one is Scorpio and the other is our church vehicle Qualis.

We were nine members seated in the Qualis. Church elder Uncle Vijay Kumar, Driver moses seated in the front. In Next row seniors Edwin, Edison and David were there. Kris well, jovial, one brother from secundrabad and I seated in the back seat.

After crossing station Jadcharla Our Qualis met with an accident. When the vehicle was gaining speed, suddenly backside left tire burst out. Due to the speed the tire was tearing apart into small tiny pieces & left over was coupled with the axle. Driver moses pressing the brakes time and again to stop the vehicle. Inside the vehicle we don’t know what was happening outside. But we were sensing that our Qualis lost control. We heard scratching noise of the rims n axel like stones falling on the vehicle. It was shaking like anything. After the tires burst out with steel rims, axle only it drags up to 100 Yards, revolved up to 260 degrees and then backside rim hits to the road divider. Nine People inside the vehicle along with me altogether were screaming loudly Lord! Lord! We all thought vehicle will definitely tilt and our lives ended here. I hold front seat so firmly with fear.

In that difficult circumstances God was intervened. I am the direct witness to the God’s invisible hands, who controlled and stopped the vehicle very safely. No minor scratch to anyone of us. We all safely reached the destination to distribute the relief material.

After this incident we gathered together beside the road and thanked & praised the Lord in Prayer. All of us experienced God’s presence with us. And I remembered Church elder Joseph Jayasurya solemn prayer at starting place, “Lord lead your children and be with them although this Journey”. After this incident took place brother Edwin said like this… “See… Our human lives are how fragile it is?”

At that time, I believe all of us were singing the song in our hearts, “what a faithful God have I… what a faithful God”. I am humming it.

All praises to our Lord Christ.

Sunday, October 11, 2009

Decrease In Grain Production

* Decrease In Grain Production - Due to Floods N Drought Conditions Story

Floods - Price Rice Of Vegitables N Fruits



పండ్లు, కూరగాయలకు వరద పోటు

fruits


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: కరవు వెంట వచ్చిన వరదలతో పండ్లు, కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా సాగవుతున్న ఆరు రకాల పండ్ల తోటలకు అపార నష్టం వాటిల్లింది. కర్నూలు, మహబూబ్‌నగర్‌, గుంటూరు, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు అరటి, బత్తాయి, బొప్పాయి, సపోటా, జామ పంటలు బాగా దెబ్బతిన్నాయి. వీటితో పాటు ఉల్లి, టామాటా, మిరప పంటలు కూడా నీట మునిగాయి. దీంతో కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. బహిరంగ మార్కెట్‌లో, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల నుంచి స్వతహాగా మిగిలిన చోట్లకు వచ్చే అన్ని సరుకుల రేట్లను వ్యాపారులు వెంటనే పెంచేసి అమ్ముతున్నారు. అదేమని ప్రశ్నిస్తున్న సామాన్యులను వరదల వల్ల ఆయా జిల్లాల నుంచి కూరలు, పండ్లు, నిత్యావసరాల స్టాకు రావడం లేదని తేల్చేస్తున్నారు. కూరలు, నిత్యావసరాల కోసం ఇతర జిల్లాలపైనే ఆధారపడిన విజయవాడ, గుంటూరు నగరాల్లో ధరలు భారీగా పెరుగుతున్నాయి.

ఉల్లి ధరలకు కన్నీళ్లు

కర్నూలు జిల్లాపై వరదలు తమ ఉగ్రరూపాన్ని చూపడంతో ఉల్లి పంట పూర్తిగా నీట మునిగింది. రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాలకు కర్నూలు నుంచే ఉల్లి సరకు మార్కెట్‌లోకి వస్తుంది. అయితే అకాల వర్షాలతో ఈ సారి 16, 400 ఎకరాల్లో ఉల్లి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారిక అంచనా. ఎక్కువ రోజులు నీటిలో నానిపోవడంతో ఉల్లిగడ్డలు లోలోపలే కుళ్లిపోయాయి. వీటి వల్ల మార్కెట్‌లోకి సరకు రావడం లేదు. దీంతో వరదల ముందు వరకు రూ. 10 - 15 మధ్యనే ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో రూ. 24 వరకు ధర పలుకుతున్నాయి.

కూర‘గాయాలు’

రాష్ట్ర ప్రజల అవసరాలకు ప్రతీ నెలా 2 కోట్ల టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. అయితే తగ్గిపోతున్న కూరగాయల సాగు, కరువు, చీడపీడ సమస్యలు దృష్టిలో ఉంచుకుంటే వీటి దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఇప్పటికే మార్కెట్‌లో బెండ, దొండ, టమాటో, పచ్చి మిర్చి, కాకర, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ తదితర కూరగాయలు గత రెండు రోజుల్లోనే కిలోకు రూ. 2 లకు పైగా పెరిగాయి. గ్రామాల నుంచి సరకు రావడం కూడా తగ్గుతోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉల్లి ధరలు ఇప్పటికే ఘాటెక్కగా మిగతా కూరగాయల రేట్లు కూడా క్రమంగా కొండెక్కుతున్నాయి. మరో వారంలో టమాట కేజీ రూ. 25 లు పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో టమాటో సాగుకు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టం కలిగింది. సాధారణ సగటు విస్తీర్ణం 69 వేల హెక్టార్లు కాగా ఇది సగానికి సగం పడిపోయింది. వరదల కారణంగా ఇదే పరిస్థితి మరో రెండు వారాలు కొనసాగితే టమాట ధరలకు రెక్కలొచ్చే ప్రమాదముందని వ్యాపారులు అంటున్నారు.

అరటి పళ్లు డజను రూ. 25!

పేద వారికి సైతం అందుబాటులో చౌకగా దొరికే అరటి పండు ఇప్పుడు ఒక్కొక్కటి రూ. 3 లు ధర పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌లో డజనెక్కడా రూ. 25 లకు తగ్గడం లేదు. మన రాష్ట్రంలో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీగా, కోస్తాలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈ పంటను సాగు చేస్తున్నారు. మొత్తం మీద ప్రతీఏటా రాష్ట్రంలో 75 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అరటి సాగవుతోంది. సాధారణ పరిస్థితుల్లో అన్నీ బాగుంటే 26.31 లక్షల టన్నులు దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది వాతావరణ అంత అనుకూలంగా లేకపోవడం, తెగుళ్లు తదితర కారణాల వల్ల అరటి సాగు విస్తీర్ణం, దిగుబడి 30 శాతం వరకు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాగు ఖర్చులు, శ్రమ ఎక్కువగా ఉండడంతో రైతులు అరటి అంటే అనాసక్తి చూపుతున్నారు. పంజాబ్‌, హర్యానా కు మన అరటి పండ్లు ఈ సీజన్‌లో ఇప్పటికే ఎగుమతి చేశారు. దీంతో రాష్ట్రీయ విపణిలో అరటి పళ్ల విక్రయాలు మండుతున్న ధరలతో సామాన్యుడికి మరింత ప్రియమవుతున్నాయి.

*వరదలకు పండ్లు, కూరగయ పంటలకు జరిగిన నష్టం
list1

list

Thursday, October 8, 2009

సమూల ప్రక్షాళన!

ఐఏఎస్ ల బదలీ యోచన
సిఎం పేషీలోకి కొత్త నీరు !
వైఎస్ సన్నిహిత వర్గ అధికారులకు చెక్

ROSAIAH-3

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరిపాలనా యంత్రాంగ సమూల ప్రక్షాళనకు పూనుకున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి తనకు పూర్తి మద్దతు ఉందన్న సంకేతాలు రోశయ్యకు ఇప్పటికే అందడంతో ఆయన స్వతంత్రంగా, తన దైన శైలిలో సమర్థవంతమైన పాలన అందించాలని ఉవ్విళ్లూరుతున్నారు. వైఎస్‌ వర్గానికి సన్నిహితంగా మసలుతున్న ఐఏఎస్‌ అధికారులకు పూర్తిగా చెక్‌ పెట్టనున్నారు. సి బ్లాక్‌లో అడుగుపెట్టాక ఇప్పటికే ఏవియేషన్‌ కార్పొరేషన్‌ ఎండి బ్రహ్మానంద రెడ్డి సస్పెన్షన్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మిపై బదిలీ వేటు వేయడం ద్వారా మార్పులు తప్పవనే సంకేతాలను రోశయ్య ఇప్పటికే పంపారు. ఈ మార్పులు జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఉన్నతాధికారు లెవరూ తేరుకోకుండా రాష్ట్ర డిజిపి యాదవ్‌ సహా 5గురు ఐపిఎస్‌ల బదిలీలు చేసి ఎవరి ఒత్తిడులు, లాబీయింగ్‌లకైనా చెక్‌ పెట్టగలరని నిరూపించారు.

సమర్థవంతమైన పాలన అందించేందుకు ఐఏఎస్‌ల మార్పులపై కూడా దృష్టి సారించనున్నారు. ఈ మార్పులు మొదట సీఎం పేషీ నుంచే మొదలవుతాయని వార్తలొస్తున్నాయి. వైఎస్‌ హయాంలో పని చేసి ఇప్పుడు ఆయన వర్గానికి సన్నిహితంగా మెలుగుతున్న అధికారులం దరినీ తొలగిస్తారని తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సమర్థులైన అధికారులను సీఎం పేషీలోకి తీసుకోవాలనేయోచనలో ఉన్నారు. ఇదే కోణంలో సమూల మార్పులు కనుక జరిగితే పాల నపై రోశయ్య ముద్ర తథ్యమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సోనియా అభి నందనల తరువాత పూర్తిస్థాయి సీఎంగా స్వతంత్య్ర శైలిలో సమర్థ వంతమైన పాలన అందించే దిశగా రోశయ్య ప్రస్థానం సాగుతోంది.

సిఎం పేషీతోనే మొదలు...

ముఖ్యమంత్రిగా రోశయ్య పగ్గాలు చేపట్టాక సీఎం పేషీలోకి కొత్తనీరు రానుంది. సీఎం ఆంతరంగిక కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి పదవీ విరమణ, హెలికాప్టర్‌ దుర్ఘటనలో ఐఏఎస్‌ అధికారి సుబ్ర మణ్యం మరణంతో సీఎం పేషీలో 2 స్థానాలు ఇప్ప టికే ఖాళీగా ఉన్నాయి. మరో నెల తరువాత కార్యదర్శి భాను డిప్యుటేషన్‌ ముగుస్తుండడంతో సీఎం పేషీలో మూడవ ఖాళీ ఏర్పడుతుంది. వీరి స్ధానాల్లో కొత్త ఐఏఎస్‌లను ఎవరిని తీసుకురావాలనే దిశ లో సీఎం రోశయ్య, ఆయన సన్నిహితులు కసరత్తు మొదలుపెట్టారు.గతంలో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు పాటించిన సామాజికవర్గ కూర్పు అనుసారమే సీఎం పేషీలో మార్పులుండొచ్చని ఐఏఎస్‌ అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.

సామాజిక వర్గాల ప్రాతిపదికన..

వైఎస్‌ హయాంలో మైనారిటీ, దళిత, బిసి, అగ్ర వర్ణ అధికారులు ఒక్కొక్కరిగా సీఎం పేషీ కూర్పు ఉంది. జన్నత్‌ హుస్సేన్‌ మైనారిటీల నుంచి, కార్యదర్శి సుబ్రమణ్యం దళిత వర్గం, కార్యదర్శి భాను బిసి సామాజిక వర్గం కాగా, ప్రభాకర్‌ రెడ్డి అగ్ర కులానికి చెందిన అధికారిగా సీఎం పేషీలో విధులు నిర్వహించారు. రోశయ్య చేసే మార్పులు కూడా ఈ కూర్పుకు అనుగుణంగానే సాగవచ్చని వార్తలు వెలువడుతున్నాయి. సిఎంఓ భర్తీకి సంబంధించి అధికారుల సమర్థత,గత అనుభవాలు పలువురు అధికారుల పనితీరుపై సీఎం తన సన్నిహత వర్గాలతో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. సీఎం పేషీలోకి వచ్చే అధికారులుగా దినేష్‌ కుమార్‌, లవ్‌ అగర్వాల్‌, సివిఎస్‌కె శర్మ, ఐవైఆర్‌ కృష్ణారావు, కె రాజు, రెడ్డి సుబ్రమణ్యం తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరి పేర్లతోపాటు మరికొందరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.

జన్నత్‌కు మరో అవకాశం?

ప్రస్తుతం ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న జన్నత్‌ హుస్సేన్‌ కొనసాగించే సూచనలున్నాయి. సీఎం పేషీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు స్ధానాల్లోకి దళిత సామాజిక వర్గం నుంచి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యాం బాబ్‌, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శులు శామ్యూల్‌/ రెడ్డి సుబ్రమణ్యం, గ్రామీణా భివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె రాజు పేర్లు వినిపిస్తున్నాయి. పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) సిఇఓగా పనిచేస్తున్న విజయ్‌ కుమార్‌ను కూడా సిఎంఓలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. స్వాతంత్య్ర సమరయోధుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య కుమారుడు కావడం ఆయనకు కలసి వస్తుందని భావిస్తున్నారు. ఇపుడు సీఎం పేషీలో కార్యదర్శులుగా కొనసాగుతున్న మాదిరెడ్డి ప్రతాప్‌, ఆర్‌ కె గోనెల లను కూడా మార్చాలని యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రతాప్‌ ఐపిఎస్‌ అధికారి కావడంతో ఆయన్ను బదిలీ చేసి ఆయన స్థానంలో ఐఏఎస్‌కు స్ధానం ఇవ్వనున్నట్లు తెలిసింది.