Friday, January 30, 2009

490 పీ హెచ్ సీ ల్లో మందులు నిల్!

* ఆయుష్ విభాగాల్లో 4 నెలలుగా ఇదే దుస్థితి
* 63 రకాల్లో ఒక్క మందూ లేదు
* బడ్జెట్ మళ్ళింపులే కారణమా?


Friday, January 16, 2009

108, 104 బోర్డుల ప్రక్షాళన ఏది?!


* 95 శాతం ప్రభుత్వ నిధులు... పెత్తనం 'సత్యం' పెద్దలదా?
* ఆడిటింగ్ లో పారదర్శకత లేకుంటే ఎలా?
* పుట్టి మునిగే దాకా వేచి చూసే వైఖరి!

హైదరాబాద్‌, జనవరి 15:
కంపెనీ ఖాతా ల్లో తప్పుడు లెక్కలు చూపి వేల కోట్ల రూపాయలు దండుకు న్నాక గానీ ప్రభుత్వాలు కళ్లు తెరవలేదు. ఇకపై 108, 104 సేవల విషయంలో ఈ సంక్షోభం పునరావృతమవుతుందా?! ఇప్పుడు సత్యం ఉద్యోగులు వీధిన పడకుండా ఉండేందుకు కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. మరి సత్యం ఫౌండేషన్‌కు అనుబంధంగా నడుస్తూ 108, 104 సేవలందిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ రీసెర్‌‌చ ఇనిస్టిట్యూట్‌ (ఇఎంఆర్‌ఐ), హెల్‌‌త మేనేజ్‌మెంట్‌ రీసెర్‌‌చ ఇనిస్టిట్యూట్‌ (హెచ్‌ఎంఆర్‌ఐ) స్వచ్ఛంద సంస్థల మాటేమిటి?! వీటిలో సత్యం కంప్యూటర్‌‌స నుంచి వచ్చిన వారు, రామలింగరాజుతో సన్నిహిత సంబం ధ బాంధవ్యాలున్న వారే కీలకస్థానాల్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం `జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌' (ఎన్‌ఆర్‌హె చ్‌ఎం)ను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఇస్తున్న నిధుల్లో సింహభాగం ఈ సంస్థల ఖాతాల్లోకే వెళుతున్నాయి. మరి ఈ ఖాతాల్లోకి వెళుతున్న ప్రజా ధనం సక్రమంగా ఖర్చవుతోందా? లేక దారి మళ్ళుతోందా?. 95శాతం నిధులు ప్రభుత్వం సమ కూర్చుతూ ఈ సంస్థ పాలనా బోర్డు కీలక స్థానాల్లో `సత్యం' వర్గీయులే ఉంటే పారదర్శకత సందేహమే. సత్యంలో తలెత్తిన సంక్షోభంలో 108, 104 సేవలపై పడకుండా ఉండాలంటే `ఇఎంఆర్‌ఐ', `హెచ్‌ఎంఆర్‌ఐ' గవర్నింగ్‌ బోర్డుల ను పునర్వ్య వస్థీకరించాల్సిన అవసరముంది.
`ఇఎంఆర్‌ఐ' బోర్డులో రాలిన స్వతంత్ర వికెట్లు

ప్రజోపయోగ పనులకు 95శాతం ప్రభుత్వ నిధులు ఖర్చవుతున్న ఈ సంస్థల కీలక పదవుల్లో మాత్రం `సత్యం' హవా ఇప్పటికీ నిరాటంకంగా సాగుతోంది. `సత్యం' సంక్షోభం తదనంతర పరిణామాలను చూశాక కూడా ప్రభుత్వ పెద్దల్లో ఈ అంశమై చలనం లేదు. సంక్షోభం వెలుగు చూసిన కొద్దిరో జులకే `108-ఇఎంఆర్‌ఐ' గవర్నింగ్‌ బోర్డులో ఐదుగురు స్వతంత్ర డైరెక్టర్ల వికెట్లు పడిపోయాయి. ఒక్కొక్కరుగా ఎటు వంటి ప్రకటనలు చేయకుండా రాజీనామాలు సమర్పించారు. `ఇఎంఆర్‌ఐ' బోర్డుకు గౌరవ చైర్మన్‌గా కొనసాగుతున్న మాజీ రాష్టప్రతి, ప్రముఖ శాస్త్రవేత్త ఎ.పి.జె అబ్దుల్‌ కలామ్‌ వైదొలిగారు. ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్‌ ఎండీ, సీఇఓ కే.వీ. కామత్‌, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)కు చెందిన తరుణ్‌ దాస్‌, హార్వర్‌‌డ బిజినెస్‌ స్కూలు పట్టభద్రుడు పి. కృష్ణ, నాస్కామ్‌ మాజీ అధ్యక్షుడు కిరణ్‌ కార్నిక్‌ కూడా తప్పుకు న్నారు. మరో ఐదుగురు డైరెక్టర్లు బోర్డులో మిగిలారు. ఇందులో లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ తప్ప మిగిలిన వారు సత్యం కంప్యూ టర్‌‌స, ఆ సంస్థ అధినేత రాజుకు ఏదో ఒక విధంగా సన్నిహితులే. మరి స్వతంత్ర డైరెక్టర్లు లేకుండా `ఇఎంఆర్‌ఐ' పాలన, ఆర్థిక అంశాల్లో పారదర్శకత సాధ్యపడదు. `హెచ్‌ఎంఆర్‌ఐ - 104' కు ఈ సెగ ఇంకా తగల లేదు.

ఖర్చు ప్రభుత్వానికి... పేరు `సత్యానికి'!

108, 104 సేవలకు ప్రభుత్వం 95 శాతం నిధులు సమకూరుస్తున్నా, ఆ సంగతి సాధారణ ప్రజలెవరికీ తెలీదు. సత్యం ఫౌండేషనే ఈ సేవా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తోందని భావించే వారే ఎక్కువ. రెండేళ్ల క్రితమే అత్యవసర సేవల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు ఇచ్చినా అంబులెన్సుల మీద ప్రభుత్వ లోగో ముద్రించలేదు. 95శాతం నిధులు ఇచ్చేటట్లు ఒప్పందం కుదుర్చుకున్న తరువాత నుంచి మాత్రమే (ఏడాది క్రితం) రాజీవ్‌ ఆరోగ్య శ్రీ లోగోలను 108, 104 వాహనాలపై ముద్రిస్తున్నారు. సరిగ్గా యాజమాన్యం విషయంలో ఇవే సూత్రాలు కొనసాగుతున్నాయి. 108 సేవలు ఇప్పటికే 8 రాషా్టల్రకు విస్తరించాయి. కీలక పదవుల్లో సత్యం వర్గీయులు ఉండడంతో సంస్థలకు వస్తున్న నిధులు పక్కదారి పడితే ఆ ప్రభావం ఈ సారి ప్రజా ప్రయోజనాలపై పడుతుం ది. అలా కాకూడదంటే నిపుణులైన స్వతంత్ర డైరెక్టర్లకు బోర్డులో స్థానం కల్పించాలా? బోర్డునే పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలా? అనే నిర్ణయం ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి. ఇప్పటివరకు ఆడిటింగ్‌ వ్యవహారాలను క్షుణ్ణంగా సమీక్షించి స్వతంత్ర ఆడిటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
5శాతం తగ్గించుకోం : సీఈఓ
అత్యవసర సేవల్లో (108) ఐదు శాతం వాటాను వెనక్కు తీసుకోబోమని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్‌ (ఇఎంఆర్‌ఐ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ీసీఈఓ) సిహెచ్‌. వెంకట్‌ స్పష్టం చేశారు. `సత్యం' సంక్షోభం తరువాత రామలింగ రాజు ప్రారంభించిన 108 సేవల్లో మీ వంతు పెట్టుబడులు ఉపసంహరించుకుని పూర్తిగా ప్రభుత్వ నిర్వహణకు అప్పగిస్తారా?! అన్న విశ్లేషకుల ప్రశ్నకు ఆయనీ సమాధానం చెప్పారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి 108 సేవల్లో ప్రభుత్వం 95 శాతం, సత్యం గ్రూపు 5శాతం పెట్టుబడులు పెట్టేందుకు లాంఛనప్రాయ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు 108 సేవలకు యాజమాన్య ఖర్చులు, సాంకేతిక సాయం మాత్రమే సత్యం గ్రూపు నుంచి అందుతున్నాయి. మిగిలిన ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆర్థికంగా వచ్చే లోటును భర్తీ చేసుకునేందుకు విరాళాలు సేకరిస్తామని ఆయన చెప్పారు. గతంలో ఉన్నట్లే 108 ద్వారా నాణ్యమైన సేవలను ప్రజలకు అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

'పొగపై నిషేధం' గాల్లో కలిసింది!

* బడ్జెట్ లేక ఇబ్బందులు
* చట్టం అమలులో కానరాని పురోగతి


'పొగపై నిషేధం' గాల్లో కలిసింది!

* బడ్జెట్ లేక ఇబ్బందులు
* చట్టం అమలులో కానరాని పురోగతి

హైదరాబాద్‌, జనవరి 6:
బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధం అమలు నత్తనడకన సాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల ఆఫీసు క్యాంపస్‌లలో తప్పించి రోడ్లు, బస్టాపులు, ఫాస్‌‌టఫుడ్‌ సెంటర్లు, హోటళ్లు, టీస్టాల్‌‌స, ఎక్కువ జనసమర్థం ఉండే చోట్ల ఈ చట్టం అమలు కావడం లేదు. చట్ట ఉల్లం`ఘను'లపై చలాన్లు రాసి జరిమానా విధించడంలో సరైన శిక్షణ, అలవాటు లేక పోవడంతో పోలీసు, ఔషధ నియంత్రణ శాఖలు మినహా మిగిలిన వైద్య ఆరోగ్య శాఖ విభాగాలు పూర్తిగా వెనుక బడ్డాయి. విద్యా సంస్థలు, కాలేజీలు, యూనివర్శిటీ ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయం చట్టరీత్యా నేరమె నప్పటికీ ఈ చట్టం అమలు మొదలైన ఈ మూడు నెలల్లో పాఠశాల విద్యాశాఖ నుంచి ఒక్క కేసూ నమోదు కాలేదు!. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగ డంపై నిషేధం అమలులోకి వచ్చి మూడు నెలలు గడిచాయి. గత ఏడాది గాంధీ జయంతిన మొదƒ లైన ఈ కార్యక్రమాన్ని `పొగ బాబులు' తప్ప అందరూ హర్షిం చారు. ఇకపై బయట పొగ ఉధృతితో ఉక్కిరిబిక్కిరవడం తగ్గుతుందని ఆశించారు.కానీ ఈ చట్టం అమలులో ప్రభుత్వం శ్రద్ధ కనబరచకపోవడంతో తగి నంత పురోగతి సాధ్యపడలేదు. తమిళనాడు, చండీగఢ్‌తో సహా పలు రాషా్టల్రు ఈ చట్టం అమలులో ముందుకు దూసుకుపోతున్నాయి. ఆంధ్రప్ర దేశ్‌ మాత్రం పొగపై నిషేధంలో మూడవ స్థానంతోనే సరి పెట్టుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో పొగపై నిషేధం అమలుకు తగిన బడ్జెట్‌ కేటాయించకపోవడంతో సమ స్యలు ఎదురవుతున్నాయి. ఈ చట్టం అమలుపై ప్రతీ మూడు నెలలకోసారి పూర్తి వివరాలతో హైకోర్టుకు, కేంద్రా నికి నివేదిక సమర్పించాలి. పొగపై నిషేధం సీరియస్‌గా తీసుకోని రాషా్టల్రకు కేంద్రం నుంచి లేఖల రూపంలో ఇప్ప టికే అక్షింతలు పడ్డాయి.

బడ్జెట్‌ ఏదీ?!

చాలా ప్రభుత్వ శాఖలు జరిమానా విధించేందుకు చలాన్‌ బుక్‌లు లేవు. ప్రచారానికి అవసరమైన పోస్టర్లు, బ్యానర్లు, చట్టం పుస్తకాల ముద్రణ వీటన్నింటికి అవ… సరమైన డబ్బు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రంలో అతున్నత స్థాయి వరకు చట్టం సరిగా అర్థమవ్వాలంటే పుస్తకాలు ముద్రించాల్సి ఉంటుంది. కేవలం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌ఆర్‌హెచ్‌ ఎం) అమలవుతున్న గ్రామాల్లో పంచడానికే 21 వేల కాపీలు కావాలి. ఈ డబ్బెవరిస్తారు?! చట్టం కేంద్రం చేసినా అమలు చేయాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. ఇది మధ్యలో వచ్చిన చట్టం కావడంతో ఆరోగ్య శాఖ బడ్జెట్‌లో దీని కోసం నిధులు కేటాయించలేదు.

అమలులో ఇబ్బందులు

వైద్య విధాన పరిషత్‌ (వీవీపీ), వైద్యవిద్యా శాఖ, పాఠశాల విద్యాశాఖ ఈ చట్టం అమలులో పూర్తిగా వెను కబడ్డాయి. స్వతహాగా ఈ వ్యవహారాల్లో అనుభవమున్న పోలీస్‌, ఔషధ నియంత్రణ సంస్థ, ఐపీఎం తదితర శాఖలు గణీయమైన ఫలితాలు సాధించాయి. పొగపై నిషేధం అమలులో సమస్యలు అధిగమించేందుకు తగిన కార్యాచ రణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ రమేష్‌ చంద్ర `సూర్య' కు తెలిపారు. ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు కొన్ని శాఖలకే ఈ చట్టంపై అవ గాహన కలిగించామని, ఇకపై అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించి అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ప్రతీ సంస్థనూ భాగస్వాములను చేయాలన్న ఆలోచన ఉందన్నారు. ఏకాంతంలో సిగరెట్‌ తాగితే... కేన్సర్‌ ఒక్కరికే వస్తుంది .అదే బహిరంగ ప్రదేశాల్లో అయితే పొగరాయుళ్ల కన్నా కూడా ఎక్కువగా అక్కడున్న వారే ఎక్కువగా కేన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

Tuesday, January 13, 2009

అవసరం లేకున్నా ఆపరేషన్లు!


అవసరం లేకున్నా ఆపరేషన్లు!

ఇదే 'ఆరోగ్య శ్రీ' ప్రత్యేకత
డబ్బు దండుకునేందుకే
పేదల ఆరోగ్యంతో ప్రైవేటు చెలగాటం

హైదరాబాద్‌, జనవరి 11 (మేజర్‌ న్యూస్‌):

`ఆరోగ్య శ్రీ' తో అందరికీ వైద్యం!.. అంటూ ఆర్భాటంగా సర్కార్‌ చేస్తున్న సర్కార్‌ అంతా ఇంతా కాదు. అయితే ఆ వంకతో రోగులకు అవసరమున్నా లేకున్నా ఆపరేషన్ల మాత్రంచకాచకా జరుగుతున్నాయి. జిల్లాల్లోని చాలా గ్రామాలు, చిన్న పట్టణాలలో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్య శ్రీ వచ్చాక ప్రతీ చిన్న సమస్యకు శస్త్రచికిత్సే వైద్యంగా భావించడం పెరిగిపోతోంది. పేదలు ఆరోగ్య శ్రీ కార్డులు పట్టుకుని ఆయా ప్రాంతాల్లో పేరొందిన ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లకు పరిగెడెతున్నారు. దీంతో కొందరు డాక్టర్లు అత్యాశకు పోయి అవసరమున్నా లేకున్నా రోగులకు శస్త్రచికిత్సలు చేసేస్తున్నారు. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే మందు లతో తగ్గిపోయే జబ్బులకు కూడా ఆపరేషన్లు చేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నా యి. పలు ప్రైవేటు ఆసుపత్రులు ప్రాణాలకు ప్రమాదం లేని చికిత్సలను ఎంచుకుని పేదప్రజల ఆరోగ్యంతో చెలగాటమా డుతున్నాయి. రోగుల ప్రాణాలకు ప్రమాదం లేకపోయినా ఇతరత్రా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ఆరోగ్య శ్రీ కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో వెలుస్తున్న క్లినిక్‌లు, నర్సింగ్‌హోంల పాలిట కామధేనువుగా మారింది. ఆ మాటకొస్తే ఆరోగ్య శ్రీ చికిత్సల కోసమే కొన్ని ఆసుపత్రులు కూడా వెలిశాయి. వరంగల్‌లోని ఓ పేరొందిన ప్రైవేటు ఆసుపత్రిలో కేవలం మూడు నెలల వ్యవధిలోనే 375 హిస్టరెక్టమీ (గర్భాశయం తొలగింపు) శస్త్ర చికిత్సలను అనుమతి లేకుండా చేశారు. ఆరోగ్య శ్రీ పేరు చెప్పి వచ్చే డబ్బు దండుకునేందుకు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

విచ్చలవిడిగా హిస్టరెక్టమీలు

గ్రామీణ మహిళలలో తలెత్తు తున్న సాధారణ సమస్య ఇంట్రా మెన్ట్రు్యవల్‌ బ్లీడింగ్‌ (తెల్లబట్ట) తో గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందని భయపెట్టి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. 40 ఏళ్ల పైబడిన మహిళలకు మాత్రమే గర్భాశయ తొలగింపు శస్త్రచికిత్సలు చేయాలన్న నిబంధనలున్నా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వీటిని బేఖాతరు చేస్తున్నాయి. వరంగల్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఈ మధ్య జరిగిన శస్త్రచికిత్సలన్నీ 30 ఏళ్ల లోపు స్త్రీలపై జరిగినవే. నార్మల్‌ డెలివరీలు పక్కకు నెట్టేసి ఇటీవలి కాలంలో కాన్పుకు `సిజేరియన్‌' చేయడం పరిపాటిగా మారింది. వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌తో పాటు ఉత్తర కోస్తాలోని శ్రీకా కుళం తదితర జిల్లాల్లో ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఏ ఆసుపత్రిలోనైనా హిస్టరెక్టమీ ఆపరేషనుకు 8 వేల రూపాయలకు మించి ఖర్చు కాదు. ఈ జబ్బులకు రూ. 6 వేలకు కూడా నాణ్యమైన చికిత్స అందించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఆరోగ్య శ్రీలో మాత్రం కార్పొరేట్లకు కూడా `గిట్టుబాటయ్యేలా' ఈ శస్త్రచికిత్సకు రూ. 30 వేలు ఇస్తున్నారు. దీంతో చిన్న చిన్న పట్టణాల్లోని నర్సింగ్‌హోంలు, ఓ మోస్తరు ఆసుపత్రులు విచక్షణారహితంగా ఆపరేషన్లు చేస్తున్నాయి. ఈ తరహా చికిత్సలు చేసినందుకు మూడు నెలల్లో రూ. 1.12 కోట్లు వరంగల్‌లోని ప్రైవేటు ఆసుపత్రి ఖాతాలో జమ అయ్యాయి. ఆరోగ్య శ్రీని తమ వ్యాపార అవసరాలకు హాస్పిటల్‌‌స ఎలా వాడుకుంటున్నాయో ఇదే నిదర్శనం. గ్రామీణ మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని సీనియర్‌ గైనకాలజిస్టులు చెబుతున్నారు. ప్రాణహాని లేకున్నా వీటివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, తిరిగి మాతృత్వం పొందే అవకాశాలను పూర్తిగా తుడిచిపెడుతున్నారని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూలాలు వదిలేశారు?!

గ్రామాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న బాల్య వివాహాలే ఈ సమస్యకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆడపిల్లలకు 17 ఏళ్లకే వివాహాలు 20 ఏళ్లు కూడా నిండకుండానే 2-3 కాన్పులు అవుతుండడంతో 24 ఏళ్లకే తెల్లబట్ట, క్రానిక్‌ సిర్వో సెర్విటిస్‌, బల్కీ యుటిరస్‌, పెల్వీ ఇంప్లిమెంటరీ డిసీజ్‌ (పీఐడీ) తరహా సమస్యలు పెరుగుతున్నాయి. విద్యాబోధన, ఆరోగ్యంపై సరైన అవగాహన కలిగిస్తే వీటిని తేలిగ్గా అరికట్టవచ్చు. కానీ పీహెచ్‌సీల స్థాయిలో చిన్నచిన్న జాగ్రత్తలు గాలికొదిలేసి సమస్యలు పెద్దవయ్యాక ఆపరేషన్లకు తెగబడితే ఏం ప్రయోజనం?!. ఇటువంటి కేసులు తరచుగా బయటపడుతున్నా ఉన్నతాధికారులు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలపై ఎటువంటి కఠినచర్యలూ తీసుకోకపోవడం మరింత అలక్ష్యానికి హేతువవుతోంది.