Tuesday, December 30, 2008

"ఆరోగ్యశ్రీ" ఆకర్షణ!

(AP Medical & Health 2008 Roundup)
ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించినా ముఖ్యమంత్రి వైఎస్‌ మానస పుత్రికైన `ఆరోగ్య శ్రీ' జనాకర్షణ పథకంగా నిలిచింది. విధి నిర్వహణలో ఉండే వైద్యులను దాడుల నుంచి కాపాడేందుకు దేశంలోనే తొలిసారిగా చట్టపరమైన రక్షణ తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు. తొమ్మిదేళ్ల తరువాత మూడు కొత్తగా మూడు మెడికల్‌ కాలేజీల (రిమ్‌‌స) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ జరుగుతున్నా ప్రజల ఆరోగ్య ప్రమాణాలు `ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందానే ఉన్నాయి.

జనాకర్షణ పథకం 2008 - `ఆరోగ్య శ్రీ'!

సోనియా గాంధీ ఈ ఏడాది జూలై 17 న నెల్లూరులో ఆరోగ్య శ్రీ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించారు. ప్రజలు, అధికారుల నుంచి ఆరోగ్య శ్రీపై ఎన్ని ప్రశంసలు కురిశాయో, ప్రతిపక్షాలు, వైద్య నిపుణులు, మేథావుల నుంచి అంతకు రెట్టింపు విమర్శలనూ మూటకట్టుకుంది. ఆరోగ్య శ్రీ ద్వారా అందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అని ప్రభుత్వం ఊదరగొడుతున్నా... రాష్ట్ర ప్రజలందరి వైద్య అవసరాలు తీర్చే సమగ్ర వైద్యబీమా పథకంగా ప్రభుత్వం తీర్చిదిద్దలేదు. ప్రజలకు ఈ పథకం మంచిదా? చెడ్డదా? అన్నది అప్రస్తుతం. పేదలకు అందుతున్న ఇన్‌స్టంట్‌ ఫలితాల దృష్టా్య ప్రతిపక్షాల లాజిక్‌లు దీనిపై తీవ్రంగా పనిచేయడం లేదు. ఎవరు అవునన్నా, కాదన్నా `ఆరోగ్య శ్రీ' కాంగ్రెస్‌ పాలకుల ఖాతాలో మరో జనాకర్షక పథకంగా నిలిచిపోయింది. దీన్ని చూసిన మిగిలిన రాషా్టల్రు పేర్లు మార్చి అమలు చేసేందుకు ఉవ్విళ్లూ రుతున్నాయి. కర్ణాటక దీనిని ఇప్పటికే `యశస్విని' పేరుతో అమలు చేస్తుండగా, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌ తదితర రాషా్టల్రు ఈ పథకంపై ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయి.
డాక్టర్లకు చట్ట రక్షణ:
గత ఏడాది చివర్లో జూనియర్‌ డాక్టర్లు, ప్రభుత్వ వైద్య సిబ్బందిపై రాజకీయ ప్రోద్బలంతో దాడులు జరగడంతో వారికి చట్టపరంగా రక్షణ అవసరమని ఆందోళనలకు దిగారు. దీనిపై ప్రభుత్వం మొదట ఆర్డినెన్‌‌స జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఏప్రిల్‌ 27న డాక్టర్ల రక్షణకు 11వ బిల్లును ఆమోదింపజేసింది. దీని ప్రకారం ఎవరైనా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులకు దిగితే మూడేళ్లపాటు జైలు శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి. దీంతో పాటు... చికిత్స చేస్తుండగా ఎవరైనా రోగి చనిపోతే ఆయా డాక్టర్లపై గతం లో ఐపీసీ 304 సెక్షన్‌ ప్రకారం విచారణ లేకుండానే కేసులు పెట్టరాదని 323 జీఓను జారీ చేసింది. నాన్‌టీచింగ్‌, ఇఎస్‌ఐ డాక్టర్లకు తాయిలాలు: రాష్ట్రంలోని నాన్‌ టీచింగ్‌ వైద్యులకు యుజీసీ స్కేళ్లు ఇవ్వకపోయినా అత్యవసర వైద్య సేవల ఎలవెన్సు పేరుతో నెలకు రూ. 3000 పెంచే ఏర్పాటు చేశారు. టైం బౌండ్‌ ప్రమోషన్లకు హామీ ఇచ్చారు. పీజీ వైద్య విద్యార్థులకు రూ. 1500 ఎలవెన్సులు కూడా వర్తిస్తాయి. వీటికోసం జీఓ387 జారీ చేశారు.
3 కొత్త కళాశాలలు:
రాష్ట్రంలో తొమ్మిదేళ్ల తరువాత మూడు కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాజీవ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడి కల్‌ సైన్సెస్‌ (రిమ్‌‌స) పేరుతో ఆదిలాబాద్‌, శ్రీకాకుళం, ఒంగోలు జిల్లాల్లో వీ ఏర్పా టు చేస్తున్నారు. ఒక్కో కాలేజీలో 100 మంది ప్రవేశానికి వీలు కల్పిం చారు. మరో మూడు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని వైఎస్‌ ప్రకటించారు.

అనారోగ్య ముఖచిత్రం: ఫ్యామిలీ హెల్‌‌త సర్వే

రాష్ట్రం హెచ్‌ఐవీ కేసుల నమోదులో దేశంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. 35 శాతం మంది స్త్రీలు గృహహింస ఎదుర్కొంటున్నారని నేషనల్‌ ఫ్యామిలీ హెల్‌‌త సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ఫలితాలు వెల్లడించాయి. పిల్లల్లో పౌష్టికాహార లోపాలు, రక్తహీనత ఇంకా సమస్యలుగానే ఉన్నాయని, టీకాల కార్యక్రమం అరకొరేనని ఫ్యామిలీ హెల్‌‌త సర్వే గణాంకాలు చెబుతున్నాయి.
104 - ఫోన్‌, మొబైల్‌ సేవలు:
ప్రారంభ స్థాయిలోనే వ్యాధుల నిర్థారణ, పరీక్షల కోసం 104 మొబైల్‌ వ్యాన్‌ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సామాన్యులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా 104 టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా వైద్య నిపుణుల సలహాలు సూచనలు తీసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.ఇక ప్రభుత్వాసుపత్రులు మాత్రం అరకొర మౌలిక వసతులు, డాక్టర్లు, వైద్య సిబ్బందితో ఈ ఏడాది గడిపేశాయి. టీచింగ్‌ హాస్పిటళ్లు మొదలుకొని పీహెచ్‌సీల వరకు ఉన్న సమస్యలు ఇసుమంత కూడా మారలేదు. మెడికల్‌ కాలేజీల్లో కూడా 35 శాతం ఫ్యాకల్టీ కొరతతోనే కొనసాగుతున్నాయి. దీంతో భావి డాక్టర్లు, వైద్య సిబ్బంది నాణ్యమైన శిక్షణతో బయటకొస్తారా? అన్న సందేహాలు పీడిస్తున్నాయి.

మెడికల్ టెస్టులు నో ఫ్రీ @ "ఆరోగ్య శ్రీ"!

# వైద్య పరీక్షలకు డబ్బు వసూళ్లు

Medical Tests no free @Arogyasri!!

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29:
ఆరోగ్యశ్రీ పథకంలోని నిబంధనలతో రోగులు, వారి బంధువులు బేజారవుతున్నారు. ఆ పథకంలో ఉన్న నిబంధలనలు ఆస రాగా చేసుకున్న కార్పొరేట్‌ ఆస్పత్రులుఅందినకాడికి డబ్బులు దండుకుంటున్నాయి. `అందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం' ఇదీ ఆరోగ్య శ్రీనినాదం. కానీ ఇందులో ఆపరేషన్లకు అవసరమైన వైద్య పరీ‚క్షలు ఏ మాత్రం ఉచితంగా జరగడం లేదు. ఆరోగ్యశ్రీ కార్డులు అందరికీ ఇవ్వకపోవడం, ఆదాయ పరిమితి పెంచాక గులాబీ కార్డులను తెలుపు కార్డులుగా మార్చడంలో కొనసాగుతు న్న జాప్యం.. ఇవన్నీ ప్రైవేటు ఆసుపత్రులకు రోగుల నుంచి డబ్బు గుంజడానికి దోహదపడుతున్నాయి. పథకం అన్ని జిల్లాలకు విస్తరించాక ఇటీవలి కాలంలో `ప్రీ‚ ఆథరైజేషన్‌' సమస్యలు పెరిగాయి.

అనుమతుల్లో తప్పని జాప్యం

హఠాత్తుగా తలెత్తున్న ఆరోగ్య సమస్యలకు సత్వర వైద్య సేవలు అందాలి. అందుకు భిన్నంగా ఆరోగ్య శ్రీ పరిధిలో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తిని ఎవరైనా వెంటనే హాస్పిటల్‌కు తరలిస్తారు. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయించాలంటే అనుమ తుల కోసం ఆంబులెన్సుతో సహా సీఎం క్యాంప్‌ కార్యాల యానికి వెళ్ళాలా? అంటే అధికారుల నుంచి అవుననే జవా బులే వినిపిస్తున్నాయి. తెలుపు రేషన్‌ కార్డుండి, ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే ఎవరికైనా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి. న్యూరోసర్జరీ, హార్‌‌ట స్ట్రోక్‌, మె దడు సమస్యలు, ప్రమాదాల్లో తీవ్రగాయాలు వంటి అత్యవసర కేసులక్కూడా ఇవే సమస్యలు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఏ రోగినైనా ఆసుపత్రిలో చేర్చు కోవాలంటే ట్రస్‌‌టలోని డాక్టర్లు ప్రీఆథరైజేషన్‌ అనుమతులు ఇవ్వాలి. తెలుపురేషన్‌ కార్డున్నా తమకు చికిత్స మొదలు పెట్టాలంటూ సీఎం క్యాంప్‌ కార్యాలయ ఆవరణలోని ఆరోగ్య శ్రీ కౌంటరుకు పరిగెత్తాలి. ఒక్కోసారి ఇలా చికిత్స కు అనుమతులు (ప్రీఆథరైజేషన్‌) తీసుకునేందుకు రెండు, మూడు రోజులు పడుతోంది. అప్పటి వరకు చికిత్సఆపితే రోగి ప్రాణాలకే ముప్పు. కానీ వారు నిజమైన లబ్ధిదారులైనా సరే ఈ నరకయాతన తప్పదు. అప్పట వరకు అయ్యే మెడికల్‌ టెస్టులు, చికిత్సకయ్యే మొత్తం ఖర్చులు రోగి బంధువులే చెల్లించాలి. ఆరోగ్య శ్రీ ఉందనుకొని డబ్బు లేకుండా కార్పొరేట్‌ హాస్పిటల్‌ గుమ్మమెక్కితే వైద్య పరీక్షల ఖర్చు లే తడిసి మోపెడవుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో నాలుగైదు మెడికల్‌ టెస్టులు, వసతి, మందులు, సెలైన్ల ఖర్చులు, ఆంబులెన్‌‌స, సర్వీస్‌చార్జీలకే రూ.25 వేలపైన ఖర్చవుతున్న సందర్భాలూ ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయి లో సమస్య లు ఇలా ఉంటే ఇక `ఆన్‌లైన్‌ అనుమతులు... ఆలస్యమే లేదు' అనే ఆమాత్యుల ప్రకటనలు అర్థమేమిటి?!

పరిధిలో ఉన్నా మెలికలు!

ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లకే డబ్బు, అవి లేకుంటే లేదు అన్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్నికేసులు ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్నా అన్ని సమయాల్లో ఆపరేషన్‌ అవసరమవదు. మైల్‌‌డ హార్‌‌టస్ట్రోక్‌, కిడ్నీ మార్పిడి, కేన్సర్‌ తదితర కేసుల్లో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ తరహా కేసుల్లో ఆపరేషన్‌ అయితేనే ఆరోగ్యశ్రీ పథకం నుంచి నిధులు మంజూరవుతాయి. ఆప రేషన్‌ జరుగని పరిస్థితుల్లో రోగుల బంధువులే తమ జేబు నుంచి వైద్య సేవల పూర్తి ఖర్చులు భరించక తప్పదు. ఇటువంటి సమ స్యలు ఎదురవుతాయని అనిపిస్తే ప్రైవేటు వైద్య పరీక్షలకు ముందుగా డబ్బు చెల్లించేందుకు అంగీకరిస్తేనే చికిత్సకు చేర్చుకుంటామని మెలికపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మెడికల్‌ టెస్టులు చెల్లించేందుకు సైతండబ్బు లేని పేద వారిగా కనిపిస్తే హాస్పిటల్‌ చేర్చుకునేందుకు సైతం నిరాకరిస్తున్నారు. ఈ సమస్యలను అధికారుల వద్ద ప్రస్తావిస్తే... వైద్య పరీక్షలు, మందులు, ఆపరేషన్‌ జరిగాక అవసరమయ్యే చెకప్‌లు, వైద్య సేవలు అన్నీ ఉచితమేనని పాత జవాబులే వినిపిస్తున్నాయి. ఏవైనా ఇబ్బందులెదురైతే ట్రస్‌‌ట ఆఫీసులో లేదా టోల్‌ ఫ్రీ నెంబరుకు డయల్‌ చేసి ఫిర్యాదు చేయా లని సరిపెట్టేస్తున్నారు.కానీ ప్రజల్లో వీటిపై అవగాహన పెంచేందుకు ఎటువంటి చర్యలూ తీసు కోవడం లేదు. ప్రీ ఆథరైజేషన్‌ను మరింత వేగవంతం చేయడం, ఈ పథకం పరిధిలోని సమస్యలకు ఆపరేషన్‌ అవసరమున్నా..లేకు న్నా ఉచిత చికిత్స, అత్యవసర వైద్యం అవసరమైన సంద ర్భాల్లో మామూలు నిబంధనల నుంచి మినహాయింపు వంటి మార్పులు చేపడితే తప్ప ఆరోగ్య శ్రీ పనితీరు మరింత మెరుగుపడదు.

Saturday, December 27, 2008

పేరుకే ధర్మాసుపత్రి మందులు మాత్రం అడగొద్దు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26:

ఉస్మానియా పేరుకే ధర్మాసుపత్రి...మందులు మాత్రం బయట కొనుక్కోవాల్సిన దుస్థితి. అధునాతన వైద్య పరికరాల ద్వారా చేస్తున్న రోగ నిర్థారణ పరీక్షలకు రోగుల నుంచి యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వాటిని యూజర్‌ ఛార్జీలు అనకుండా ఫిల్‌‌మ రేట్లు అంటూ పేరు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. తమ వాళ్లయితే మందులు ఫ్రీగా లభిస్తాయి. లేదంటే బయట కొనుక్కోవాల్సిందే. అత్యవసర మందులు.... ఇంజెక్షన్లు ఇలా చాలావాటి కోసం రోగుల బంధువులకు ప్రిస్క్రిప్షన్‌ రాసి బయట నుంచే తెప్పిస్తున్నారు.ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు మెడికల్‌ షాపుల వారు తమ శక్తిమేరకు రేట్లు పెంచి రోగులను దోచుకుంటున్నారు. దీంతో నిరుపేదల జేబులు గుల్లవుతున్నాయి. ఇక ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరత వల్ల రోగులతో పాటు నర్సులు, కిందిస్థాయి ఉద్యోగుల వరకు అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలో మందులు, డిస్పోజబుల్‌‌సకు బడ్జెట్‌ రూ. 86 లక్షలు కేటాయించింది. ఈ నిధులు సక్రమంగా వినియోగిస్తే ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగికీ ఉచితంగా మందులివ్వచ్చు. కానీ ఆచరణలో అలా జరగడం లేదు.

జోరుగా కమిషన్‌ దందా
రోగులకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైతే ఔట్‌ పేషెంట్‌ కన్సల్టేషన్‌ వరకు బాగానే జరుగుతున్నాయి. మందులకు మాత్రం ప్రిస్క్రిప్షన్‌ రాసిస్తున్నారు. `మందులు ఇవ్వరా?' అని ఎవరైనా అడిగితే జ్వరం తగ్గేందుకు రెండు రోజులకు సరిపడ పారాసిటమాల్‌, విటమిన్‌ టాబ్లెట్లతో సరిపెట్టేస్తున్నారు. మిగిలిన మందులు స్టాక్‌ లేవనీ, బయటే కొనుక్కోవాలని సూచిస్తున్నారు. చిత్రంగా ఆస్పత్రి ఆవరణలోని ప్రైవేటు మెడికల్‌ షాపుల్లోనే ఈ మందులు దొరుకుతున్నాయి. మెడికల్‌ షాపు వ్యాపారులు వీటినే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అక్కడి షాపు యాజమాన్యాలకు, డాక్టర్లకు ఇదొక ఉభయతారక వ్యాపారంగా తయారైంది. ఇందులో డాక్టర్లకు కొంత కమిషన్‌ ఉంటుందని కిందిస్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ అపరేషన్లు చేయాల్సిన సమయంలో కావలసిన ఇంజెక్షన్లు, మందులకు కూడా ఇలాగే జరుగుతోంది. అత్యవసరం కావడంతో మందుల ధరలు ఎక్కువా? తక్కువా? అన్న ఆలోచన లేకుండా రోగుల బంధువులు కొనేస్తున్నారు. ఇవే మందుల ధరలు బయట మెడికల్‌ షాపుల్లో తీసుకుంటుంటే తక్కువ ఉంటున్నాయి. ఎమ్మార్పీ కన్నా రూ. 20-30 ఎక్కువ రేట్లతో ఉస్మానియాలో మందులు అమ్ముతున్న ఘటనలు అడపాదడపా వెలుగు చూస్తున్నాయి. కానీ ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) పర్యవేక్షణ కొరవడడంతో ఈ అక్రమాలు యధేచ్చగా సాగుతున్నాయి. ఈ సమస్యలతో ఉస్మానియాలో ఉచితంగా వైద్యం అందుతుందని వస్తున్న పేద రోగుల వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.

రకరకాల పేర్లతో డబ్బు వసూలు

కోట్ల రూపాయలు వెచ్చించి ఉస్మానియాలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలు రోగులకు అందుబాటులో లేవు. సీటీ స్కాన్‌, ఎమ్మారై, ఇసీజీ ఇలా ఏ మెడికల్‌ టెస్టులైనా ఫిల్‌‌మ రేట్ల పేరుతో రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఉస్మానియాలో రోజుకు కనీసం 50 సీటీ స్కాన్‌లు, 10 ఎమ్మారై స్కాన్‌లు అవుతున్నాయి. ఇవేవీ ఉచితం కాదు. గుండెజబ్బు, మెదడు, నరాల సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు అసవరమైన అన్ని మెడికల్‌ టెస్టులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య శ్రీ రోగుల విషయంలో చిన్న సమస్య అయినా హైలెట్‌ అవుతుండడంతో వారికి మాత్రం ఈ ఛార్జీలను మినహాయించారు. సీటీ స్కాన్‌, ఎమ్మారై తదితర రిపోర్టులు కావాలంటే రూ. 300- 500 చొప్పున డబ్బులు కట్టి ఫిల్ములు తీసుకోవాల్సిందే. కానీ మంత్రులు, వైద్య శాఖ అధికారులు మాత్రం ఉస్మానియా సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మెడికల్‌ టెస్టులు చేస్తున్నామని గొప్పగా చెబుతారు. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులకు వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి.

`డీఎంఇ' మార్గదర్శకాలు!

ఉస్మానియాలో ఎమ్మారై అందుబాటులోకి వచ్చాక ఉచిత వైద్య సేవలు అందుతాయని భావించిన పేద రోగులకు నిరాశే ఎదురైంది. వివిధ వర్గాల నుంచి ఎంతమేరకు యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలన్న నిబంధనలపై డీఎంఇ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన రోగులు ఎమ్మారై తీసుకుంటే రూ. 500, మామూలు రోగులకు రూ. 1500, ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చే రోగులకు రూ. 2500 వరకు వసూలు చేయాలని డీఎంఈ నుంచి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలందాయి. ఎమ్మారై ఏర్పాటు చేయక ముందు సీటీ స్కాన్‌ ఫిల్‌‌మకు రూ. 300 మాత్రమే వసూలు చేసేవారు. కానీ డీఎంఈ సూచనల తరువాత రూ. 300 బదులు రూ. 500 వసూలు చేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే వారంతా పేదవారే అయినా ఫిల్ములు జారీ చేయాలంటే డబ్బులు తప్పనిసరని రేడియాలజీ విభాగం ఉద్యోగులు చెబుతున్నారు.

నర్సులకు గదుల్లేవు!

గత ఏడాది జూలైలో ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఏంసీఐ) తనిఖీలు జరిగినప్పుడు ప్రమాణాల పేరుతో నర్సులకిచ్చిన గదులను డాక్టర్లు ఆక్రమించుకున్నారు. నిజానికి అప్పటి దాకా వారికి కూడా రూములు లేవు పాపం. ఇక తనిఖీలు పూర్తయ్యాక కూడా అక్కడే తిష్టవేయడంతో నర్సులు కారిడార్లు, వార్డుల్లో ఉండే టేబుళ్ల దగ్గరా సెటిలయ్యారు. నర్సులకు కేటాయించిన `సీఎస్‌జీ బ్లాక్‌' ఏ క్షణంలోనైనా కూలేందుకు సిద్ధంగా ఉంది. హెరిటేజ్‌ బిల్డింగ్‌ అన్న సాకుతో దీనిని కూలగొట్టి కొత్త భవనాలు నిర్మించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. నర్సింగ్‌ కాలేజీ పక్కన బేగం బజార్‌ వైపు 10 ఎకరాలకు పైగా ఉన్న ఖాళీ స్థలంలో నర్సుల కోసం కొత్త భవనం కట్టాలని ఇప్పటికే పలుమార్లు సర్కారుకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. లేడీ డాక్టర్లు, నర్సులకు డ్రస్‌ మార్చుకునేందుకు గదులు లేవు. కూర్చుని భోం చేసేందుకు సరైన క్యాంటీన్‌, రెస్‌‌ట రూం సైతం లేవు. ఇదీ ఉస్మానియాలో మౌలిక వసతుల పరిస్థితి. ఉద్యోగుల పరిస్థితులే ఇలా ఉంటే రోగులకు వసతులు ఎలా ఉంటాయో ఇక ఊహించుకోవచ్చు. ఆ షెడ్‌ 20 మందికి మించి సరిపోదు!ఉస్మానియా ఆస్పత్రిలో నిత్యం సగటున 1500 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వీరికి సహాయకులుగా వచ్చిన వారిలో చాలా మంది ఆస్పత్రి ఆవరణలో సరైన వసతులు లేక నానా అగచాట్లు పడుతున్నారు. రోజుకు కనీసం 300 మంది ఆస్పత్రి పరిసరాల్లో చెట్లకింద, కారిడార్లు, మెట్లమీద ...ఇలా ఎక్కడో ఓ చోట విశ్రమిస్తున్నారు. 27 ఎకరాల సువిశాల ఉస్మానియా ప్రాంగణంలో రోగుల సహాయకుల కోసం నామమాత్ర రుసుముతో వసతి సౌకర్యాలు కల్పించే విధంగా ఓ ప్రత్యేక భవనం కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఇంతవరకు ఎందుకు రాలేదో అధికారులకే తెలియాలి. రోగులతో పాటు వచ్చిన వారు విశ్రాంతి తీసుకునేందుకు ఓ చిన్న షెడ్డుంది. ఎక్కువలో ఎక్కువ 25 మందికి సరిపోతుంది. అందులో సగం వంటశాలకిచ్చేశారు. ఈ సమస్యలు తెలిశాయో ఏమో రోగుల సహాయకులకు రోజువారీ అద్దెతో గదులిచ్చేందుకు ఓ ధార్మిక సంస్థ ముందుకొచ్చింది. ఆస్పత్రి పక్కనే ఉన్న `రామనాథ్‌ ఆశ్రమం'లో రోగుల సహాయకులకు రోజుకు రూ.20- 40వరకు తీసుకుని గది అద్దెకిస్తున్నారు. ఓ సాధారణ స్వచ్ఛంద సంస్థకున్న కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరం.

పేరుకే ధర్మాసుపత్రి ... మందులు మాత్రం అడగొద్దు!!

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26:
ఉస్మానియా పేరుకే ధర్మాసుపత్రి...మందులు మాత్రం బయట కొనుక్కోవాల్సిన దుస్థితి. అధునాతన వైద్య పరికరాల ద్వారా చేస్తున్న రోగ నిర్థారణ పరీక్షలకు రోగుల నుంచి యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వాటిని యూజర్‌ ఛార్జీలు అనకుండా ఫిల్‌‌మ రేట్లు అంటూ పేరు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. తమ వాళ్లయితే మందులు ఫ్రీగా లభిస్తాయి. లేదంటే బయట కొనుక్కోవాల్సిందే. అత్యవసర మందులు.... ఇంజెక్షన్లు ఇలా చాలావాటి కోసం రోగుల బంధువులకు ప్రిస్క్రిప్షన్‌ రాసి బయట నుంచే తెప్పిస్తున్నారు.ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు మెడికల్‌ షాపుల వారు తమ శక్తిమేరకు రేట్లు పెంచి రోగులను దోచుకుంటున్నారు. దీంతో నిరుపేదల జేబులు గుల్లవుతున్నాయి. ఇక ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరత వల్ల రోగులతో పాటు నర్సులు, కిందిస్థాయి ఉద్యోగుల వరకు అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలో మందులు, డిస్పోజబుల్‌‌సకు బడ్జెట్‌ రూ. 86 లక్షలు కేటాయించింది. ఈ నిధులు సక్రమంగా వినియోగిస్తే ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగికీ ఉచితంగా మందులివ్వచ్చు. కానీ ఆచరణలో అలా జరగడం లేదు.
జోరుగా కమిషన్‌ దందా
రోగులకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైతే ఔట్‌ పేషెంట్‌ కన్సల్టేషన్‌ వరకు బాగానే జరుగుతున్నాయి. మందులకు మాత్రం ప్రిస్క్రిప్షన్‌ రాసిస్తున్నారు. `మందులు ఇవ్వరా?' అని ఎవరైనా అడిగితే జ్వరం తగ్గేందుకు రెండు రోజులకు సరిపడ పారాసిటమాల్‌, విటమిన్‌ టాబ్లెట్లతో సరిపెట్టేస్తున్నారు. మిగిలిన మందులు స్టాక్‌ లేవనీ, బయటే కొనుక్కోవాలని సూచిస్తున్నారు. చిత్రంగా ఆస్పత్రి ఆవరణలోని ప్రైవేటు మెడికల్‌ షాపుల్లోనే ఈ మందులు దొరుకుతున్నాయి. మెడికల్‌ షాపు వ్యాపారులు వీటినే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అక్కడి షాపు యాజమాన్యాలకు, డాక్టర్లకు ఇదొక ఉభయతారక వ్యాపారంగా తయారైంది. ఇందులో డాక్టర్లకు కొంత కమిషన్‌ ఉంటుందని కిందిస్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ అపరేషన్లు చేయాల్సిన సమయంలో కావలసిన ఇంజెక్షన్లు, మందులకు కూడా ఇలాగే జరుగుతోంది. అత్యవసరం కావడంతో మందుల ధరలు ఎక్కువా? తక్కువా? అన్న ఆలోచన లేకుండా రోగుల బంధువులు కొనేస్తున్నారు. ఇవే మందుల ధరలు బయట మెడికల్‌ షాపుల్లో తీసుకుంటుంటే తక్కువ ఉంటున్నాయి. ఎమ్మార్పీ కన్నా రూ. 20-30 ఎక్కువ రేట్లతో ఉస్మానియాలో మందులు అమ్ముతున్న ఘటనలు అడపాదడపా వెలుగు చూస్తున్నాయి. కానీ ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) పర్యవేక్షణ కొరవడడంతో ఈ అక్రమాలు యధేచ్చగా సాగుతున్నాయి. ఈ సమస్యలతో ఉస్మానియాలో ఉచితంగా వైద్యం అందుతుందని వస్తున్న పేద రోగుల వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
రకరకాల పేర్లతో డబ్బు వసూలు
కోట్ల రూపాయలు వెచ్చించి ఉస్మానియాలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలు రోగులకు అందుబాటులో లేవు. సీటీ స్కాన్‌, ఎమ్మారై, ఇసీజీ ఇలా ఏ మెడికల్‌ టెస్టులైనా ఫిల్‌‌మ రేట్ల పేరుతో రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఉస్మానియాలో రోజుకు కనీసం 50 సీటీ స్కాన్‌లు, 10 ఎమ్మారై స్కాన్‌లు అవుతున్నాయి. ఇవేవీ ఉచితం కాదు. గుండెజబ్బు, మెదడు, నరాల సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు అసవరమైన అన్ని మెడికల్‌ టెస్టులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య శ్రీ రోగుల విషయంలో చిన్న సమస్య అయినా హైలెట్‌ అవుతుండడంతో వారికి మాత్రం ఈ ఛార్జీలను మినహాయించారు. సీటీ స్కాన్‌, ఎమ్మారై తదితర రిపోర్టులు కావాలంటే రూ. 300- 500 చొప్పున డబ్బులు కట్టి ఫిల్ములు తీసుకోవాల్సిందే. కానీ మంత్రులు, వైద్య శాఖ అధికారులు మాత్రం ఉస్మానియా సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మెడికల్‌ టెస్టులు చేస్తున్నామని గొప్పగా చెబుతారు. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులకు వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి.
`డీఎంఇ' మార్గదర్శకాలు!
ఉస్మానియాలో ఎమ్మారై అందుబాటులోకి వచ్చాక ఉచిత వైద్య సేవలు అందుతాయని భావించిన పేద రోగులకు నిరాశే ఎదురైంది. వివిధ వర్గాల నుంచి ఎంతమేరకు యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలన్న నిబంధనలపై డీఎంఇ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన రోగులు ఎమ్మారై తీసుకుంటే రూ. 500, మామూలు రోగులకు రూ. 1500, ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చే రోగులకు రూ. 2500 వరకు వసూలు చేయాలని డీఎంఈ నుంచి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలందాయి. ఎమ్మారై ఏర్పాటు చేయక ముందు సీటీ స్కాన్‌ ఫిల్‌‌మకు రూ. 300 మాత్రమే వసూలు చేసేవారు. కానీ డీఎంఈ సూచనల తరువాత రూ. 300 బదులు రూ. 500 వసూలు చేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే వారంతా పేదవారే అయినా ఫిల్ములు జారీ చేయాలంటే డబ్బులు తప్పనిసరని రేడియాలజీ విభాగం ఉద్యోగులు చెబుతున్నారు.
నర్సులకు గదుల్లేవు!
గత ఏడాది జూలైలో ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఏంసీఐ) తనిఖీలు జరిగినప్పుడు ప్రమాణాల పేరుతో నర్సులకిచ్చిన గదులను డాక్టర్లు ఆక్రమించుకున్నారు. నిజానికి అప్పటి దాకా వారికి కూడా రూములు లేవు పాపం. ఇక తనిఖీలు పూర్తయ్యాక కూడా అక్కడే తిష్టవేయడంతో నర్సులు కారిడార్లు, వార్డుల్లో ఉండే టేబుళ్ల దగ్గరా సెటిలయ్యారు. నర్సులకు కేటాయించిన `సీఎస్‌జీ బ్లాక్‌' ఏ క్షణంలోనైనా కూలేందుకు సిద్ధంగా ఉంది. హెరిటేజ్‌ బిల్డింగ్‌ అన్న సాకుతో దీనిని కూలగొట్టి కొత్త భవనాలు నిర్మించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. నర్సింగ్‌ కాలేజీ పక్కన బేగం బజార్‌ వైపు 10 ఎకరాలకు పైగా ఉన్న ఖాళీ స్థలంలో నర్సుల కోసం కొత్త భవనం కట్టాలని ఇప్పటికే పలుమార్లు సర్కారుకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. లేడీ డాక్టర్లు, నర్సులకు డ్రస్‌ మార్చుకునేందుకు గదులు లేవు. కూర్చుని భోం చేసేందుకు సరైన క్యాంటీన్‌, రెస్‌‌ట రూం సైతం లేవు. ఇదీ ఉస్మానియాలో మౌలిక వసతుల పరిస్థితి. ఉద్యోగుల పరిస్థితులే ఇలా ఉంటే రోగులకు వసతులు ఎలా ఉంటాయో ఇక ఊహించుకోవచ్చు. ఆ షెడ్‌ 20 మందికి మించి సరిపోదు!ఉస్మానియా ఆస్పత్రిలో నిత్యం సగటున 1500 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వీరికి సహాయకులుగా వచ్చిన వారిలో చాలా మంది ఆస్పత్రి ఆవరణలో సరైన వసతులు లేక నానా అగచాట్లు పడుతున్నారు. రోజుకు కనీసం 300 మంది ఆస్పత్రి పరిసరాల్లో చెట్లకింద, కారిడార్లు, మెట్లమీద ...ఇలా ఎక్కడో ఓ చోట విశ్రమిస్తున్నారు. 27 ఎకరాల సువిశాల ఉస్మానియా ప్రాంగణంలో రోగుల సహాయకుల కోసం నామమాత్ర రుసుముతో వసతి సౌకర్యాలు కల్పించే విధంగా ఓ ప్రత్యేక భవనం కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఇంతవరకు ఎందుకు రాలేదో అధికారులకే తెలియాలి. రోగులతో పాటు వచ్చిన వారు విశ్రాంతి తీసుకునేందుకు ఓ చిన్న షెడ్డుంది. ఎక్కువలో ఎక్కువ 25 మందికి సరిపోతుంది. అందులో సగం వంటశాలకిచ్చేశారు. ఈ సమస్యలు తెలిశాయో ఏమో రోగుల సహాయకులకు రోజువారీ అద్దెతో గదులిచ్చేందుకు ఓ ధార్మిక సంస్థ ముందుకొచ్చింది. ఆస్పత్రి పక్కనే ఉన్న `రామనాథ్‌ ఆశ్రమం'లో రోగుల సహాయకులకు రోజుకు రూ.20- 40వరకు తీసుకుని గది అద్దెకిస్తున్నారు. ఓ సాధారణ స్వచ్ఛంద సంస్థకున్న కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరం.

Friday, December 26, 2008

ఈ రోగికి దిక్కెవరు?

హైదరాబాద్‌, డిసెంబర్‌ 25:
188 వసంతాల ఘనచరిత్ర ఉస్మానియా ఆసుపత్రి సొంతం...అందుకే పర్యాటక శాఖ ఆ భవన సముదాయాన్ని వారసత్వ సంపదగా గుర్తించింది. కానీ ఇన్ని సంవత్సరాల్లో కార్పొరేట్ స్థాయికి వెళ్ళాల్సిన వైద్య ప్రమాణాలు ఆ ఆసుపత్రిలో పూర్తిగా భ్రష్టు పట్టాయని చెప్పక తప్పదు!!
వెలుపలి నుంచి చూస్తే ఉస్మానియా ఆసుపత్రి భవనాలు నిజాం నిర్మాణ నైపుణ్యంతో వైభవాన్ని సంతరించుకుని దర్పంగా కనిపిస్తాయి. లోపల మాత్రం రోగులు తమను పట్టించుకునేదెవరని దీనంగా చూస్తుంటారు. నిజాం సంస్థానం ఐదవ రాజైన అసఫ్‌ జాహీ రాచ కుటుంబీకులు, బ్రిటీష్‌ అధికారులు, ఉన్నతాధికారులు, నగరం లోని సంపన్నులకు ఒకప్పుడు వైద్య సేవలం దించిన ఆస్పత్రి అది. ప్రారంభించిన తొలి నాళ్లలో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం నేరుగా ఇక్కడికే వచ్చే వారు. కాలక్రమంలో వైద్యరంగంలో కార్పొరేటీకరణ, ప్రభుత్వాల ఉదాసీన వైఖరి, అధికారులు, డాక్టర్ల నిర్లక్ష్యం...తదితర కార ణాలతో నిరుపేదలు, అనాథలకు మాత్రమే ఉస్మా నియా పరిమితమైంది. వైద్యవిద్య మంత్రి గల్లా అరుణ కుమారి పూర్తిగా ఆరోగ్య శ్రీ సేవలో బిజీగా ఉండడంతో టీచింగ్‌ ఆస్పత్రి అయిన ఉస్మానియాను పట్టించుకునేవారే కరువ య్యారు. ఆస్పత్రి లోపలికి అడుగుపెడితే కానీ తెలీదు... అదో మునిసిపల్‌ డంపింగ్‌ యార్డని. కారిడార్‌ లోంచి కర్చీఫ్‌ ముక్కున అదిమిపెట్టుకుని వెళుతున్నా ఉక్కిరిబిక్కిరి చేసే దుర్గం ధంతో శ్వాస పీల్చడం కష్టమవుతుంది. `రావడం మొదటి సారా... అయితే కష్టమే! నిదానంగా అదే అలవాటవు తుంది' అనేస్తారక్కడి రోగులు. ఇంతవరకైతే పర్లేదు... ఔట్‌ పేషెంట్‌ దశ నుంచి ఆపరేషన్‌, డిశ్చార్‌‌జ ఇలా అన్ని దశల్లో సహనానికి రోగులకు పరీక్షలెదురవుతాయి. `ఇలా ఎంతవరకు? ఎంతకాలం?! 'అని ప్రశ్నిస్తే... `సర్కారు దవాఖానాలో తప్పదు సారూ!... సర్దుకుపోవాలె!' అనే జవాబు వస్తుంది!!

*****
సాయంత్రం ఆరు దాటుతోంది. చలి తన ప్రతాపం చూపేందుకు సిద్ధమైంది. పక్షులన్నీ తమ గూళ్లకు చేరు కుంటున్నాయి. కానీ రాత్రికి తామెక్కడ తలదాచుకోవాలో ఆ కుటుంబానికి దిక్కుతోచలేదు. కడుపులో పుండైన తండ్రిని ఉస్మానియాలో చేర్పించాలని వారు ఆదిలాబాద్‌ నుంచి ప్రయాసపడి రాజధానికి చేరుకున్నారు. డాక్టర్ల కోసం ఉదయం నుంచి ఔట్‌ పేషెంట్ల క్యూలో నిలబడే ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఎదురు చూసినా వారి వంతు రాలేదు.డాక్టర్ల డ్యూటీ అయిపోయింది... ప్రైవేటు ప్రాక్టీసు కెళ్ళిపొయారు. ఇక చేసేదేంలేదు... మళ్ళీ రేపే!! చాలా సేపటి వరకు తర్జనభర్జనలు పడ్డారు. చివరికి సెక్యూరిటీ దయాదాక్షిణ్యాలతో ఉస్మానియాలోని కులీకుతుబ్‌ షా భవనం ముందు ఖాళీ జాగాలో చెట్ల కింద పడుకునేందుకు సిద్ధమయ్యారు. 188 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల దుస్థితికిదో మచ్చుతునక.
*****
కరెంట్‌ షాక్‌ తగిలి ఒళ్లంతా కాలిపోవడంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన పాండును 3 నెలల కిత్రం బర్‌‌న వార్డులో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ఈయన సంరక్షణకు వచ్చిన భార్య, మామకు మూడు నెలలుగా బర్‌‌న వార్డు బయట మెట్ల మీదే నివాసం. రోగుల అటెండెంట్‌‌స కోసం కేటా యించిన షెడ్‌లో నీళ్లు, చెత్తా చెదారం పేరుపోవడం వల్ల దోమలు సై్వరవిహారం చేస్తున్నాయి. దుర్గంధం ప్రబల డంతో ఇక్కడ ఉండేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు.నిత్యం నాలుగువేల మంది తిరిగేస్థలంలో... నాలుగు భవనాలున్న చోట ఆస్పత్రిలో చేరిన రోగుల బంధువులు, దూరƒ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఉండేందుకు కూడా కనీసవసతి సౌకర్యాలు కల్పించకపోవడం దారు ణం. వజ్రోత్సవాలు దాటిన చరిత్ర ఘనమే... కానీ ఇక్కడ రోగుల స్థితి అత్యంత దయనీయం. *****
కడుపునొప్పి తీవ్రంగా ఉండ డంతో భాగవతమ్మ (45)ను నల్గొండ జిల్లా నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వీరి ఓపీ అడ్మిషన్‌ జరిగేసరికే మధ్యాహ్నం 12గంటలు దాటింది. నొప్పి తీవ్రత తగ్గ ƒపోవడంతో ముందుజాగ్రత్త చర్యగా సెలైన్‌ పెట్టారు. స్టెచర్‌‌స లేకపోవడంతో సెలైన్‌తో సహా ఆమెను నేల మీదే వదిలేశారు. సాయంత్రం 3 దాటినా డాక్టర్ల అతీగతీ లేదు. పల్లె టూరి నుంచి వచ్చిన ఆ పేదరాలికి తెలీదు...మధ్యాహ్నం రెండు దాటితే డాక్టర్లె వరూ ఉండరని!! ఎవరో ఒకరు రాకపోతారా? తన బాధ చూడకపోతారా! అన్న ఆశతో అలసి మూగన్నుగా నిద్ర పడుతున్నా... ఆమె కళ్లు అడపాదడపా పత్తికా యల్లా విచ్చుకుంటున్నాయి.
*****
వీళ్ల కుటుంబాలే కాదు... 27 ఎకరాల సువిశాల ఉస్మా నియా ప్రాంగణంలో ఇలా అరుగుల మీద, ఆరుబయట రోజులు వెళ్లబుచ్చే రోగులు, వారి సహాయకులు చాలా మందే ఉన్నా రు. ఇది ఒక్కరిపరిస్థితి కాదు.. నేల ఈనినట్లు ఆస్పత్రిలో 4 భవన పరిసరాల్లో ఎక్కడ చూసినా దిక్కూ మొక్కూలేనిజనం.రోగులతో పాటు వచ్చిన వారు విశ్రాంతి తీసుకునేం దుకు ఓ చిన్న షెడ్డుంది. ఎక్కువలో ఎక్కువ 25 మందికి సరిపోతుంది. అందులో సగం వంట శాలకిచ్చే శారు. ఈ సమస్యలు తెలిశాయే మో... ఉస్మానియాలో రోగుల సహాయకులకు రోజువారీ అద్దెతో గదులిచ్చేందుకు ఓ ధార్మిక సంస్థ ముందుకొచ్చింది. ఆస్పత్రి పక్కనే ఉన్న `రామనాథ్‌ ఆశ్రమం'లో రోగుల సహాయకులకు రోజుకు రూ.20-40వరకు తీసుకుని గది అద్దెకిస్తున్నారు. కానీ ఈ స్తోమత కూడా లేని వాళ్లు, ఆ డబ్బుతో ఒకరోజు భోజనం ఖర్చులు వెళ్లదీసేందుకు... ఎండకు ఎండినా, వానకు తడిసినా, చలికి వణికినా ఆస్పత్రి ఆవర ణలోనే బస చేస్తున్నారు. రోగులు, వారి సహాయకులు కలిపి రోజుకు సమారు ఐదు వేల మంది వచ్చే నాలుగు సువిశాల భవనా లున్న టీచింగ్‌ ఆస్పత్రిలో మౌలిక వసతుల లేమికిది పరాకాష్ట. రోజుకు కనీసం 300 మంది ఇలా ఆశ్రయం లేక ఆస్పత్రి పరిసరాల్లో చెట్లకింద, కారి డార్లు, మెట్లమీద.... ఇలా ఎక్కడో ఓ చోట కాలం వెళ్లదీస్తున్నారు.



రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే
ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి డిశ్చార్‌‌జ అయ్యే వరకు ప్రతీ అంకంలోనూ రోగులు, వారి బంధువుల సహనానికి అనునిత్యం పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక్కడ చికిత్స కోసం చేరితే రోగులు బయటకొచ్చేందుకు చాలా కాలమే పడుతుంది. న్యూరో సర్జరీ కోసం నెల్లూరు నుంచి వచ్చిన శీనుకు ఆపరేషన్‌ చేయాలని చెప్పి నెల దాటిపో యింది. ఇందుకు రెండు విభాగాల స్పెషలిస్టులుండాలి. అనస్తీషియా, న్యూరో విభాగాల నిపుణులకు టైం కుదరక ఆపరేషన్‌ పలుమార్లు వాయిదా పడింది. ఆపరేషన్‌ అన్న ప్రతీసారీ అన్ని రకాల టెస్టులూ చేయాల్సిందే. నల్గొండలో చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసే అతని తండ్రి ఆస్పత్రి ఖర్చులు, మెడికల్‌ టెస్టుల కోసం ఇప్పటికే అప్పు చేశాడు. ఆపరేషన్‌కు దాచుకున్న డబ్బు ఆ సమయానికి కరిగిపోతే పరిస్థితిటేమిటన్న అనుమానాలు పీడిస్తున్నాయి. గవర్న మెంటు ఆస్పత్రి కదా... ఫైలుతో పాటు చికిత్సా ఆలస్య మవుతుంది. రూల్సు, టెస్టులు, సిబ్బంది లంచాలు ఇలా అన్నీ ఎక్కువే.అంతా ప్రొసీజర్‌ ప్రకారమే పోతారు.. ప్రభుత్వ నౌకరీలు కదా... ఆ మాత్రం జాగ్రత్తలు అవస రమే అంటారు. టెస్టుల కోసం వారం తరువాత రమ్మం టారు. చిన్నపాటి ఆపరేషన్‌కు ఎన్నాళ్లు తిప్పించుకుంటారో ఎవరికీ తెలీదు. దీంతో రోగుల కుటుంబాలకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
నిర్లక్ష్యానికి ఫలితమే ఈ దుస్థితి
అధికారుల అలసత్వం, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఉస్మాని యాలో రోగులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం కార్పొరేట్‌ ఆస్పత్రులకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాక, ఇక్కడి పరిస్థితులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఓ ఉద్యోగి వాపోయారు.